ఒక క్లాసులో ఒక టీచరు పిల్లలకి పాఠం చెప్త్తూ,”పిల్లలూమీరందరూ దేవుని బొమ్మను గీయండి “. అని తగిన టైం ఇచ్చిచూస్తున్నారట. ఆ క్లాసులో వున్న భిన్న మతాలూ.., సంస్కృతులూకలిగిన పిల్లలందరూ తమ తమ కుటుంబంలోని అందరూఅనుసరించీ నమ్మేటటువంటి దైవం యొక్క బొమ్మనే తమకొచ్చినవిధాన వేసి చూపించారట. అలాగని, ఆ పాఠం నేర్పే క్లాస్ టీచరుచెప్పారు కదా అని టీచరుకి ఇష్టమైనటువంటి లేదా టీచరుమతానికి సంబంధించిన దేవుని బొమ్మను గీయలేదు! వారుపుట్టినప్పటి నుండీ అనుసరిస్తున్న దైవాన్నే గుర్తు చేసుకుని ఆబొమ్మనే గీసారు. అలాగని పిల్లలందరూ ఒకే రకమైన బొమ్మనుమాత్రమే గీయండని , ఆ టీచరూ ఆంక్షలు పెట్టలేదు! ఇక్కడ టీచరుఆలోచన ఏమిటంటే.. , ఆ పిల్లలందరి చేతా ఐక్యతగా విద్యనునేర్పించాలి అంతే..! మరి పిల్లలందరు కూడా టీచరు నుండినేర్చుకోవాలనే నిబద్ధత మాత్రమే కలిగివుండటం! ఆ నిబద్ధతకోసమే సదరు టీచరుని నియమించడం కూడా..!