మానవత్వం లోపించిన మృగరాయుళ్ళ నడుమ ‘నిర్భయా’నికే దుర్భర పరిస్థితి....
మాతృరూపానికే లోకానికెల్లా నీవు, క్షమలో ధరిత్రి పోలిక.. మానవాధముల నడుమఅవనియందు గరిక సమానమిక..
మాలిన్యపు లోకములో మనమధ్యే తిరుగాడే పసిపాపలను సైతం వదలని మదమెక్కినమనుష్య మృగాలను తెగనరుకుటకు చాలునా పదీ పరకా చేతులు నీకూ..
మాయదారి ఈ లోకంలో నీవు ఒక అమ్మవీ..ఆలివీ..అక్కవీ.. చెల్లివీ.. ఈ అమానుషులచేతిలో అసహాయ మూర్తివీ..
అదంతా ఈ కబోధి లోకానికెందుకు.. ఇది చాలును నువు ఒక ఆడదానివీ.. “ ఇదిమాత్రమే చాలు నువ్వు కేవలం ఒక ఆడదానివీ..”!!